ఫ్యాక్ట్ చెక్: ఉత్తరప్రదేశ్‌ కి చెందిన మహ్మద్ షకీల్ తన కోడలిని వివాహం చేసుకున్నాడంటూ వస్తున్న సమాచారం అబద్దం

ఒక వయసైన వ్యక్తి, ఒక యువతితో ఉన్న చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రాలు మొహమ్మద్ షకీల్ కు సంబంధించినవని చెబుతున్నారు.

Update: 2025-07-12 09:44 GMT

Assam businessman

ఒక వయసైన వ్యక్తి, ఒక యువతితో ఉన్న చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రాలు మొహమ్మద్ షకీల్ కు సంబంధించినవని చెబుతున్నారు. కొడుకు కేవలం 5 రోజుల క్రితం మరణించాడని, అయితే ఆయన తన కొడుకు మరణానికి బాధపడడానికి బదులుగా, షకీల్ తన సొంత కోడలిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడని అందులో తెలిపారు.

“यूपी के देवरिया के रहने वाले मो.शकील के दरियादिली के चर्चे है।शकील का बेटा 5 दिन पहले ही इस दुनिया को छोड़कर 72 हूरों की खोजने चल बसा था। पर मो.शकील ने एक पल भी बहू को उसके शौहर की कमी नहीं खलने और अपनी ही बहू के साथ निकाह कर लिया।“ అంటూ హిందీలో పోస్టులు పెట్టారు. కొడుకు మరణించిన 72 గంటల్లోనే కోడలిని పెళ్లి చేసుకున్నాడని అందులో తెలిపారు.
“Unbelievable but this is Mauzhub's reality. In Deoria, UP Mohammad Shakeel’s son passed away just 5 days ago. What happened next is nothing short of shocking. Instead of mourning his son’s death, Shakeel chose to “fill the emptiness” by marrying his own daughter-in-law.” అంటూ అదే అర్థం వచ్చేలా ఇంగ్లీష్ లో కూడా పోస్టులు పెట్టారు.

క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు. 

ఫ్యాక్ట్ చెక్: 

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. వైరల్ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడు అస్సాంకు చెందిన వ్యాపారవేత్త.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వైరల్ ఇమేజ్ కోసం మేము వెతికాం. 2017 సంవత్సరంలో ప్రచురించిన కొన్ని వార్తా నివేదికలు, వీడియోలు మాకు కనిపించాయి. నవంబర్ 7, 2017న HJ న్యూస్ ప్రచురించిన యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలను పంచుకుంటుంది.

వీడియో వివరణ ప్రకారం ఒక వృద్ధుడు, యువతిని పెళ్లి చేసుకున్న చిత్రాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దాదాపు 70 ఏళ్ల వ్యక్తి తన కంటే చాలా తక్కువ వయసు ఉన్న స్త్రీని వివాహం చేసుకున్నాడని చెబుతూ ఉన్నారు. ఈ వృద్ధుడు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ రాజేష్ హిమ్మత్ సింగ్ అని చెబుతున్నారు. అయితే, చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ కుమార్ హిమత్సింగ్. ఆయన ఈశాన్య అస్సాం రాష్ట్రానికి చెందినవారు. రాజేష్ కుమార్ 1987లో మొదటిసారి 'హిమ్మత్ సింగ్ ఆటో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్'లో మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. అయితే, ఈ రోజుల్లో అతని కుమారుడు, బంధువులు హిమ్మత్ సింగ్ గ్రూప్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

Full View
బిబి న్యూస్ అనే ఛానల్ ప్రచురించిన మరో యూట్యూబ్ వీడియోలో ఆ వృద్ధుడి వివాహం, యువతికి సంబంధించిన మరిన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి రాజేష్ హిమత్సింకా అని నిర్ధారిస్తుంది.

Full View
2017లో దైనిక్ మరాఠీ ప్రచురించిన ఒక వ్యాసంలో ఈ ఫోటో అస్సాం రాష్ట్రానికి చెందిన రాజేష్ కుమార్ . రాజేష్ కుమార్ 1987లో హిమత్సింకా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన పిల్లలు, బంధువులు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. విత్తనాలతో పాటు, హిమత్సింకా గ్రూప్ ఆతిథ్యం, వాహనాలు, మోటార్లు వంటి అనేక వ్యాపారాలలో భాగమైంది. వారి వ్యాపారం అస్సాం, పశ్చిమ బెంగాల్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఉంది.

అందువల్ల, వైరల్ అయిన చిత్రంలో మొహమ్మద్ షకీల్, అతను తన కొడుకు మరణించిన 5 రోజుల తర్వాత తన సొంత కోడలిని వివాహం చేసుకున్నాడని చెబుతున్న వాదన నిజం కాదు. ఈ చిత్రంలో అస్సాంకు చెందిన వ్యాపారవేత్త ఒక యువతిని వివాహం చేసుకున్నాడు, ఆమె అతని కోడలు కాదు. ఈ చిత్రాలు నవంబర్ 2017లో వైరల్ అయ్యాయి.
Claim :  ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన మహ్మద్ షకీల్, తన కొడుకు మరణించిన 5 రోజుల తర్వాత తన కోడలిని వివాహం చేసుకున్నట్లు వైరల్ చిత్రాలు చూపిస్తున్నాయి.
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News