ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో ఉత్తరాఖండ్‌లోని ధరాలిలో జరిగిన విషాద సంఘటన ని చూపడం లేదు

మంగళవారం (ఆగస్టు 5, 2025) మధ్యాహ్నం ఖీర్ గంగా నదిలో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో ఉత్తరాఖండ్‌లోని

Update: 2025-08-09 08:03 GMT

flash flood video

ఆగస్టు 5, 2025 మధ్యాహ్నం ఖీర్ గంగా నదిలో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కనీసం నలుగురు మరణించగా, డజన్ల కొద్దీ కొట్టుకుపోయారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిస్థితిని పరిశీలించడానికి ధరాలి గ్రామానికి చేరుకున్నారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీయగలిగారు. సముద్ర మట్టానికి 8,600 అడుగుల ఎత్తులో ఉన్న ధరాలి పట్టణంలోని హోటళ్ళు, నివాస భవనాలను వరదలు ముంచెత్తాయి, స్థానికులు రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్‌లో భారీ నీటి అలలు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. ప్రజలు చూస్తుండగానే వారి ఇళ్లను భారీ వరద ముంచేసింది. వినాశకరమైన మేఘాల విస్ఫోటనం, ఆకస్మిక వరదలను చూపించే అనేక వీడియోలను కొంతమంది చిత్రీకరించారు.

నది ప్రవాహం మధ్యలో నుండి కొంతమందిని రక్షించినట్లు చూపించే వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలిలో జరిగిన విషాదాన్ని చూపుతుందనే వాదనతో షేర్ చేస్తున్నారు.
Full View

Full View

Full View

Full View

పోస్ట్ ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన సంఘటనను చూపించే పాత వీడియో.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతకగా, ఆగస్టు 6, 2025న ఉత్తరాఖండ్ పోలీసులు ప్రచురించిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను మాకు లభించింది. ఇది పూర్తిగా అబద్ధం, తప్పుదారి పట్టించేదని తెలుస్తోంది. ఈ వీడియోకు ధరాలి విపత్తుతో ఎటువంటి సంబంధం లేదన్నారు. దయచేసి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడం ద్వారా గందరగోళాన్ని వ్యాప్తి చేయవద్దని కోరారు.
Full View
జూలై 2022లో షేర్ చేసిన మరొక ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లోని గురుకుండ్‌లో చిక్ని నది బలమైన ప్రవాహం నుండి 5 మంది యువకులను రక్షించారని పేర్కొంటూ అదే వీడియోను షేర్ చేశారు.
Full View
మరింత శోధించగా, జూలై 29, 2022న దేవభూమి మిర్రర్ అనే పేజీ ద్వారా మరొక ఫేస్‌బుక్ పోస్ట్ కనిపించింది. అందులో “ఈరోజు మధ్యాహ్నం నలగఢ్‌లోని రాంషహర్ రోడ్డులో ఉన్న గురుకుండ్ సమీపంలోని చిక్ని నదిలో ఒక ప్రమాదం జరిగింది, అక్కడ ఐదుగురు యువకులను సురక్షితంగా రక్షించారు. నది వరదలో చిక్కుకున్న 5 మంది యువకులను రక్షించారు. అందిన సమాచారం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు గురుకుండ్‌ను సందర్శించడానికి వచ్చి సరదాగా గడపడానికి నదిలోకి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. రాంషహర్ సమీపంలోని బహేది నివాసి మనోజ్ కుమార్, తన బావమరిది ఆనంద్ శర్మతో కలిసి నలగఢ్ నుండి రాంషహర్‌కు ప్రయాణిస్తున్నాడు, అకస్మాత్తుగా నదిలోకి నీరు రావడాన్ని అతను చూశాడు. ఈ దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించాడు. నది మధ్యలో చిక్కుకున్న ఐదుగురు యువకులను స్థానికుల సహాయంతో తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు.
Full View
హిమాచల్‌లోని సోలన్‌లోని నలగఢ్‌లో గురుకుండ్ నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఈ సమయంలో నదిలో ఫోటోగ్రఫీ దిగిన 5 మంది యువకులు చిక్కుకున్నారు. దాదాపు అరగంట పాటు జీవన్మరణాల మధ్య పోరాడుతున్న యువకులను స్థానిక గ్రామస్తులు రక్షించి నది నుండి సురక్షితంగా బయటకు తీశారు.
కనుక, వైరల్ వీడియో 2022 సంవత్సరంలో చిక్ని నదిలో సంభవించిన ఆకస్మిక వరద సంఘటనను చూపిస్తుంది, ఇది ఇటీవలిది కాదు. ఈ వీడియో ఉత్తరకాశిలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదను చూపిస్తుందనే వాదన నిజం కాదు.
Claim :  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలిలో జరిగిన విషాద సంఘటనను ఈ వీడియో చూపిస్తుంది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News