ఫ్యాక్ట్ చెక్: 2019 లో జమ్మూ కశ్మీర్ లో కూలిన IAF జెట్ ను చూపుతున్న ఫాక్స్ న్యూస్ వీడియో ను ఇప్పటిది గా వైరల్ చేస్తున్నారు

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన ఖచ్చితమైన దాడుల కారణంగా అనేక మంది

Update: 2025-05-08 13:21 GMT

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన ఖచ్చితమైన దాడుల కారణంగా అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారీగా కాల్పులకు దిగింది. ఈ దాడులలో ఒక సైనికుడు మరణించాడు. పాకిస్తాన్ దళాలు ఎల్‌ఓసి వెంబడి ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నాయని, దీని వలన 12 మంది మరణించారని, 50 మందికి పైగా పౌరులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే అనేక భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెబుతోంది. ఆ విషయాన్ని నిరూపించే ప్రయత్నంలో అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు బహుళ వీడియోలు, చిత్రాలను పంచుకుంటున్నారు. కానీ ఈ విజువల్స్ లో సింహ భాగాన్ని భారతదేశంలోని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తోసిపుచ్చాయి.

విమాన ప్రమాదానికి గురైనట్లు చూపిస్తున్న ఫాక్స్ న్యూస్ వార్తా ప్రసారం లాగా కనిపించే మరొక వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. ఫాక్స్ న్యూస్ కూడా భారత రాఫెల్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసిన వార్తను ప్రచురించిందనే వాదనతో ప్రచారం చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న విమానాన్ని ప్రజలు చూస్తూ ఉండడం వీడియోలో ఉంది. “Even Fox News reported that Pakistan shot down an Indian Rafale” అనే క్యాప్షన్ తో పలువురు సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు.

Full View
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు .

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఫాక్స్ న్యూస్ వార్తా నివేదిక ఫిబ్రవరి 2019లో ప్రచురించింది. మేము వైరల్ నివేదిక నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికినప్పుడు, ఫాక్స్ న్యూస్ ప్రచురించిన అసలు వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో ఫిబ్రవరి 28, 2019న ‘Pakistani military downs Indian jets after India bombs Pakistani targets’ అనే శీర్షికతో ప్రచురించారు.

Full View
మరింత వెతికితే, స్కై న్యూస్ ప్రచురించిన వీడియో నివేదిక కూడా మాకు లభించింది. అందులో పాకిస్తాన్ ఒక భారతీయ యుద్ధ విమాన క్రాష్ ను టెలివిజన్‌లో చూపించిందని ఉంది. భారత నాయకులు దీనిని అసభ్యకరమైన ప్రదర్శనగా అభివర్ణించారు. అతన్ని వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. రెండు దేశాలు ఇటీవలి రోజుల్లో కశ్మీర్‌లో వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ ప్రాంతం గత 70 సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉంది. ఈ వీడియో కూడా ఫాక్స్ న్యూస్ వీడియో నివేదికలోని దృశ్యాలను పంచుకుంటుంది.

Full View

వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలను న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. ఫిబ్రవరి 27న జమ్మూ కాశ్మీర్‌లోని బద్గామ్ లో భారత, పాకిస్తాన్ వైమానిక దళాలు భీకర డాగ్‌ఫైట్‌లో పాల్గొన్న రోజున Mi-17 IAF హెలికాప్టర్‌ను భారత క్షిపణి ఢీకొట్టిందని, ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రకారం నలుగురు అధికారులు దోషులుగా తేలారు. ఈ సంఘటనలో ఆరుగురు సైనిక సిబ్బంది, ఒక పౌరుడు మరణించారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. 2019లో జరిగిన విమాన ప్రమాద సంఘటనను ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత రాఫెల్ జెట్‌లను కూల్చివేసిందని ఫాక్స్ న్యూస్ నివేదించిందనే వాదన నిజం కాదు .
Claim :  ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత జెట్ విమానాన్ని కూల్చివేసిందని ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ వైరల్ వీడియోలో ఉంది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News