ఐటీ దాడుల్లో రూ.220 కోట్ల స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న ప్రధాని

పన్ను ఎగవేతదారులపై మోడీ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. ఒక్కపైసా కూడా వదలకుండా వెనక్కి రప్పించేలా చర్యలు..

Update: 2023-12-10 08:48 GMT

పన్ను ఎగవేతదారులపై మోడీ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. ఒక్కపైసా కూడా వదలకుండా వెనక్కి రప్పించేలా చర్యలు చేపడుతున్నారు మోడీ.

ఒడిశాకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. మూడు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ జరుపుతున్న ఈ సోదాల్లో శుక్రవారం వరకూ రూ.220 కోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటంపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రజల నుంచి తీసుకున్న ప్రతిపైసా కూడా కక్కిస్తామన్నారు.

156 బ్యాగుల నిండి నగదు:

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారిపై ఐటీ శాఖ అధికారులు జరిపిన సోదాల్లో 156 బ్యాగుల్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాగుల్లో ఆ ఇప్పటి వరకు రూ.220 కోట్లు నగదు స్వాధీనం చేసుకుట్లు తెలిపారు.సంబల్‌పుర్‌, బోలన్‌గిరి, టిట్లాగఢ్‌, బౌద్ధ్‌, సుందర్‌గఢ్‌, రౌర్కెలా, భువనేశ్వర్‌లో ఈ సోదాలు జరిగాయి.

ఈ సోదాలపై సదరు కంపెనీ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు ఝార్ఖండ్‌కు చెందిన ఎంపీకి కూడా లిక్కర్‌ కంపెనీతో సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, పీటీఐ ప్రతినిధులు సదరు ఎంపీకి ఫోన్‌ చేద్దామని ప్రయత్నిస్తే స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. రాంచీలోని ఆయన కార్యాలయానికి వెళితే ఎంపీ అందుబాటులో లేరని సమాధానం వచ్చింది.

ఘటనపై స్పందించిన మోదీ

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. నోట్ల కట్టలు బయటపడ్డ వార్తకు సంబంధించిన క్లిప్పింగును తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నోట్ల గుట్టలు చూసి నాయకులు చెప్పే నీతి వాక్యాలు వినాలని సూచించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ హామీ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News