నిషేధం తొలగింపు.. యూటర్న్‌ తీసుకున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. గతంలో విధించిన నిషేధాన్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌ల దిగుమతిని భారత్..

Update: 2023-10-15 03:00 GMT

కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. గతంలో విధించిన నిషేధాన్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌ల దిగుమతిని భారత్ నిషేధించబోదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌ దిగుమతుల నిషేధాన్ని ఈ ఏడాది ఆగస్టులో విధించింది. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.

భారత్‌లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ల దిగుమతిపై ఎలాంటి నిషేధం ఉండదని ట్రేడ్ డేటాను విడుదల చేయడానికి మీడియా సమావేశంలో సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. దిగుమతిదారుల దిగుమతి సరుకులను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, కంప్యూటర్‌ల దిగుమతిని నవంబర్ 1 నుంచి లైసెన్స్ సిస్టమ్‌లో ఉంచుతామని ఆగస్టులో ప్రభుత్వం తెలిపింది. అయితే దిగుమతి అవుతున్న ల్యాప్‌టాప్‌లపై కఠినమైన పర్యవేక్షణ ఉంటుందని, తద్వారా ఈ దిగుమతులపై నిఘా ఉంటుందని అన్నారు. ఆంక్షలతో దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
దిగుమతి నిర్వహణ వ్యవస్థను నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని, అక్టోబర్ 30లోపు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో దేశంలో తయారీని ప్రోత్సహించడానికి, చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, మైక్రోకంప్యూటర్‌లతో సహా కంప్యూటర్‌లు, కొన్ని డేటా ప్రాసెసింగ్ మెషీన్‌ల దిగుమతిని ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ ఈ ఉత్తర్వు తర్వాత, ఐటీ హార్డ్‌వేర్‌కు సంబంధించిన పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఒక అంచనా ప్రకారం.. భారతదేశం ప్రతి సంవత్సరం 7-8 బిలియన్ డాలర్ల విలువైన కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేసుకుంటుంది.
Tags:    

Similar News