ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్.. దరఖాస్తు చేయడం ఎలా?

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తూనే ఉంది. మోడీ ప్రవేశపెడుతున్న పథకాల్లో..

Update: 2023-09-16 05:55 GMT

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తూనే ఉంది. మోడీ ప్రవేశపెడుతున్న పథకాల్లో 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' ఒకటి. ఇటీవల, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తన వీకెండ్ మీటింగ్‌లో ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను అందించబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో మహిళలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. కేబినెట్ ఈ నిర్ణయం తర్వాత దేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016లో మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం లక్ష్యం పేద, దిగువ ఆదాయ వర్గాలకు చెందిన మహిళలు కూడా ఎల్పీజీ సిలిండర్ ప్రయోజనం పొందవచ్చు. ఈ స్కీమ్‌ కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) నివసిస్తున్న మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు.ఉజ్వల 2.0 పథకం కింద దేశవ్యాప్తంగా 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,650 కోట్ల నిధులను కేటాయించింది. ఈ పథకానికి అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఉజ్వల పథకానికి ఎవరు అర్హులు?

ప్రధానమంత్రి ఉజ్వల యోజన ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళల కోసం ప్రారంభించబడింది. బీపీఎల్ కార్డు ఉన్నవారు మాత్రమే దీని ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి.. మీరు తప్పనిసరిగా రేషన్ కార్డును కలిగి ఉండాలి. దీనితో పాటు, మీ కుటుంబ ఆదాయం రూ. 27,000 లోపు ఉండాలి.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

➦ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

➦ ఇక్కడకు వెళ్లి డౌన్‌లోడ్ ఫారమ్ ఎంపికను ఎంచుకోండి.

➦ దీని తర్వాత, ఒక ఫారమ్ కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసి.. అందులో అడిగిన అన్ని వివరాలను పూరించండి.

➦ మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో డిపాజిట్ చేయండి.

➦ రేషన్ కార్డు, ఫోటో, మొబైల్ నంబర్ వంటి అవసరమైన పత్రాలను కూడా నమోదు చేయండి.

➦ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు కొత్త కనెక్షన్‌ని అందిస్తారు.

Tags:    

Similar News