Special Train: కాచిగూడ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. సమయ వేళలు

Special Train: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను

Update: 2024-01-13 14:21 GMT

Special Train

Special Train: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అయిన భారత రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొత్త కొత్త రైళ్లను సైతం నడుపుతోంది. ఇక ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరుగనుంది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా చాలా మంది అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఇక అయోధ్యకు బయలుదేరే వారి కోసం ప్రత్యేక రైలును నడుపుతోంది రైల్వే శాఖ. అది కూడా హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నడుపుతోంది.

రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

10.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగాపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Tags:    

Similar News