Ys Jagan : మళ్లీ జగన్ ప్రచారానికి సర్వం సిద్ధం

వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రచారానికి సిద్ధమయ్యారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు

Update: 2024-04-26 02:02 GMT

వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభలతో పాటు ఇరవై రెండు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలకు మంచి రెస్పాన్స్ రావడంతో మళ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 28వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకూ జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ను తయారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమై ప్రతి రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలులో జగన్ పాల్గొంటారు.

షెడ్యూల్ ఇదే...
ఈ నెల 28న ఉదయం పది గంటలకు తాడిపత్రి . 12:30 గం.లకు: వెంకటగిరి . 03:00 గం.లకు కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 29వ తేదీన ఉదయం 10 గంటలకు చోడవరం నియోజకవర్గం, మధ్యాహ్నం 12:30 గంటలకు పి.గన్నవరం, సాయంత్రం మూడు గంటలకు పొన్నూరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 30వ తేదీన ఉదయం 10గంటలకు కొండపి, మధ్యాహ్నం 12:30 గంటలకు మైదుకూరు, సాయంత్రం పీలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మే 1వ తేదీన ఉదయం 10 గంటలకు బొబ్బిలి, మధ్యాహ్నం 12:30 గం.లకుపాయకరావుపేట , సాయంత్రం ఏలూరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.


Tags:    

Similar News