Tirumala : భక్తులు ఎక్కువ... హుండీ ఆదాయం తక్కువ

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది

Update: 2024-04-28 03:25 GMT

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎండ తీవ్రతకు కొద్దిగా భక్తుల సంఖ్య తగ్గుతుందని భావించినా శని, ఆదివారాల్లో మాత్రం భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

పద్దెనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోని టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,212 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,690 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.88 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News