Tirumala : క్యూ లైన్ లో వేచి ఉండకుండానే నేరుగా దర్శనం

తిరుమలలో భక్తులు రద్దీ పెద్దగా లేదు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉండకుండానే నేరుగా భక్తులు వెళుతున్నారు

Update: 2024-04-08 02:11 GMT

తిరుమలలో భక్తులు రద్దీ పెద్దగా లేదు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉండకుండానే నేరుగా భక్తులు వెళుతున్నారు. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు. రేపు ఉగాది కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఉగాది రోజున స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని భావించి అధిక సంఖ్యలో భక్తులు రేపు వచ్చే అవకాశముందంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి శ్రీవారి దర్శనం గంట సమయంలో పూర్తవుతుంది.

ఎంత సమయం అంటే?
నిన్న తిరుమల శ్రీవారిని 73,801 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 23,055 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలో కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగాను దర్శనమిస్తున్నాయి. నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. సర్వదర్శనం భక్తులకు కూడా నాలుగు గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News