Tirumala : నేడు నేరుగా శ్రీవారి దర్శనం.. క్యూ లైన్ లో వేచి ఉండకుండానే

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. నేరుగా శ్రీవారి దర్శనాన్ని చేసుకునే వీలుంది

Update: 2024-05-07 03:32 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. నేరుగా శ్రీవారి దర్శనాన్ని చేసుకునే వీలుంది. మంగళవారం కావడంతో భక్తులు పెద్దగా తిరుమలకు చేరుకోలేదు. దీంతో భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుంది.

ఆదాయం ఎక్కువగానే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,748 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,688 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News