దానిపై నో కామెంట్.. చంద్రబాబు

ఎన్డీఏలో చేరడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించలేదు. దానిపై మాట్లాడేందుకు చంద్రబాబు నిరాకరించారు.

Update: 2022-09-01 12:06 GMT

ఎన్డీఏలో చేరడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించలేదు. దానిపై మాట్లాడేందుకు చంద్రబాబు నిరాకరించారు. ప్రచారం చేసే వారే దానికి జవాబు చెప్పాలని చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని తెలిపారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఇప్పుుడు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ప్రభుత్వంతో ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు.

రెండుసార్లు నష్టపోయింది....
తాను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా పరిపాలనపై దృష్ఠి పెట్టడం వల్ల పార్టీ రెండు సార్లు నష్టపోయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తాము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని అన్నారు. అసలు సంక్షేమానికి ఆద్యులు తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పుకొచ్చారు. అటు అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం ఏ పాలకులకైనా మంచిదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అదే చేశానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుందన్నారు.


Tags:    

Similar News