Revanth Reddy : ఎల్లుండి విశాఖకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు

Update: 2024-03-14 04:24 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొననున్నారు. ఏపీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బహిరంగ సభలో...
16వ తేదీ సాయంత్రం విశాఖపట్నంలో బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈ సభకు రేవంత్ హాజరై ప్రసంగించనున్నారు. రేవంత్ వైసీపీ, టీడీపీ, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగిస్తారని తెలిసింది. ఈ బహిరంగ సభలో జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపీ, తెలంగాణ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఏపీ మ్యానిఫేస్టోను విడుదల చేసే అవకాశముంది.


Tags:    

Similar News