Tirumala : నేడు ఫుల్లు రష్.. తిరుమలలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది

Update: 2024-03-22 04:01 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. సహజంగా వీకెండ్ లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. కానీ గత రెండు రోజుల నుంచి భక్తుల సంఖ్య అధికంగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 60,485 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,851 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.1 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్‌లోని 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శనం పది గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News