RK Roja : రోజా పరువు నష్టం దావా

మంత్రి ఆర్కే రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై పరువునష్టం దావా వేశారు. నగరి కోర్టులోక్రిమినల్ డిఫమిషన్ వేశారు

Update: 2023-11-21 12:43 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై పరువు నష్టం దావా వేశారు. నగరి కోర్టులోక్రిమినల్ డిఫమిషన్ పిటీషన్ వేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఈ పిటీషన్ వేశారు. తన పరువుకు నష్టం కలిగించే విధంగా బండారు సత్యనారాయణ మూర్తి వ్యవహరించారని ఆర్కే రోజా తాను దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు.

తనను కించ పర్చారంటూ...
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తితో పాటు మరి ఇద్దరిపై ఈ పరువు నష్టం దావా వేశారు. కొన్నాళ్ల క్రితం బండారు సత్యనారాయణమూర్తి మంత్రి ఆర్కే రోజాను మీడియా సమావేశంలో కించపర్చే విధంగా మాట్లాడారంటూ, అందుకు తగిన ఆధారాలను కూడా రోజా తరుపున న్యాయవాదులు న్యాయస్థానానికి సమర్పించారు.


Tags:    

Similar News