వైసీపీ ఓ పార్టీనా : నాగబాబు ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు నాగబాబు మండి పడ్డారు

Update: 2023-01-21 07:02 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు నాగబాబు మండి పడ్డారు. అహంకారం, అరాచకం, అవినీతి అన్నీ కలిస్తేనే వైసీపీ అని ఆయన అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. నాగబాబు పొత్తులపై కూడా స్పందించారు.

పొత్తులపై ఏమన్నారంటే?
పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. పొత్తులు కుదిరితే తమ పార్టీ అధ్యక్షుడే వెల్లడిస్తారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ అయితే ఎవరితోనూ ఎలాంటి పొత్తు లేకుండానే పార్టీని బలోపేతం చేయడంపై తాము దృష్టి పెట్టామని నాగబాబు తెలిపారు.


Tags:    

Similar News