Andhra Pradesh : పదో తరగతి పరీక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది. రేపు శనివారం రంజాన్ పండగ కావడంతో ఈ పరీక్ష తేదీని మార్పు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రంజాన్ సెలవు దినం కావడంతో రేపు జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది.
ఏప్రిల్ 2వ తేదీన...
ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నారు. మిగిలిన పరీక్షలన్నీ యధాతధంగానే నిర్వహిస్తాయి. అన్నీ పరీక్షలను ముగిసిన తర్వాత ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోనూ, హాల్ టిక్కెట్లలోనూ ఎలాంటి మార్పులు ఉండవని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.