Ys Jagan : జగన్ నాన్ సీరియస్ పొలిటీషయన్ గా మారుతున్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు. నాటి ప్రతిపక్షం ధీటుగా చేసే విమర్శలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాను బటన్ నొక్కుతూ డబ్బులు పంచుతుంటే ఓట్లు పడతాయని భ్రమించారు కానీ, నాటి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు. అదే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ దారుణ ఓటమికి కారణమయింది. అధికారం కోల్పోయినప్పటికీ జగన్ లో ఇసుమంత మార్పు రాలేదు. అదే పంథాను అనుసరిస్తుండం పార్టీ నేతలకు కూడా మింగుడు పడటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులు చేసే విమర్శలు ప్రజల్లోకి వెళితే జరిగే నష్టాన్ని కూడా జగన్ ఇప్పటికీ గుర్తించడం లేదు. ఇప్పటికీ పార్టీ తన వల్లనే గెలవాలన్న సంకేతాలను పంపానుకుంటున్నారని, సమిష్టి ప్రయత్నం చేయడం లేదన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.