Tirumala : ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు

Update: 2024-05-01 03:56 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. అయితే ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారి ఆదాయం 101 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

నేడు రద్దీ ఎలా ఉందంటే?
నిన్న తిరుమల శ్రీవారిని 72,310 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,731 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News