Tirumala : నేడు రష్ పెద్దగా లేదు.. అదే రీజన్

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య ఎక్కువగా లేదు. బుధవారం కావడం కూడా భక్తుల రద్దీ తగ్గడానికి కారణం

Update: 2024-05-08 03:40 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య ఎక్కువగా లేదు. బుధవారం కావడం కూడా భక్తుల రద్దీ తగ్గడానికి కారణం. ఒక్కసారిగా భక్తుల రద్దీ తగ్గడంతో తిరుమలలో వీధులన్నీ బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి. వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం గంట సమయంలో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే...
నిన్న తిరుమల శ్రీవారిని 65,146 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,306 మంది తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News