Tirumala : నేడు తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమిదే

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

Update: 2024-03-27 02:08 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లలో స్వల్ప సంఖ్యలోనే భక్తులు ఉన్నారు. స్వామి వారి దర్శనం కూడా త్వరగానే పూర్తవుతుంది. వసతి గృహాలు కూడా భక్తులకు సులువుగానే దొరుకుతున్నాయి. ముందుగా టిక్కెట్ బుక్ చేసుకున్న వారు తిరుమలకు చేరుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం మాత్రం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,563 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,956 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.91 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News