Tirumala : నేడు నేరుగా దర్శనానికి క్యూలైన్ లో వేచి ఉండకుండానే

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి

Update: 2024-04-24 02:55 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. వసతి గృహాలు కూడా సులువుగానే భక్తులకు దొరుకుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, బుధవారం కావడంతో భక్తుల సంఖ్య అంతగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం గంట సమయంలోనూ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారి దర్శనానికి వెళుతున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 60,371 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,301 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.09 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News