Tirumala : నేడు తిరుమలలో రష్ ఎలా ఉందంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. గురువారం అయినా కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది

Update: 2024-02-15 02:44 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. గురువారం అయినా కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి వారిని దర్శంచుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటల నుంచి నాలుగు గంటలకు పైగా దర్శన సమయం పడుతుందని తెలిపారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 67,275 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,293 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.07 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పద్దెనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోని భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News