కేంద్రం ఆహ్వానం : ఢిల్లీకి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే నెల 5న ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆయన వెళుతున్నారు

Update: 2022-11-23 07:32 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే నెల 5న ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాజకీయ పార్టీలతో...
భారత్ లో నిర్వహించే జీ 20 భాగస్వామ్య దేశాల సమ్మిట్ పై ఈ సమావేశాలలో ప్రధాని రాజకీయ పార్టీ అధ్యక్షులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర మంద్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించడంతో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.


Tags:    

Similar News