Chandrbabu : నేడు విశాఖకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. విశాఖలో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. ఈరోజు మద్యాహ్నం 2.30 గంటలకు విశాఖలోని నోవోటెల్ హోటల్ లో ఈ సదస్సుకు హాజరవుతారు. మారిటైమ్ లాజిస్టిక్స్ పై దృష్టి సారించేలా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. మారి టైమ్ రంగంలోని ఆరు స్టార్టప్ లతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.
పారిశ్రామికవేత్తలతో భేటీ...
బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్ , ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీలేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోనున్నారు. ఈ అంశంపై నిర్వహించనున్న ప్లీనరీ సెషన్ పాల్గొననున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మారి టైమ్ బోర్డు, జీఎఫ్ఎస్టీ సంయుక్తంగా రూపొందించిన వ్యూహాత్మక పత్రాలను విడుదల చేయనున్నారు. అలాగే ఎయిర్ కార్గో ఫోరమ్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.