మూడేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుంటూరు వైద్యుల దాతృత్వం

చిన్నతనం నుంచే కొందరికి కష్టాలు వెంటాడుతుంటాయి. కొందరు పుట్టుకతోనే వింతగా పుట్టడం, పుట్టిన తర్వాత రకరకాల వ్యాధులు..

Update: 2023-11-17 14:45 GMT

చిన్నతనం నుంచే కొందరికి కష్టాలు వెంటాడుతుంటాయి. కొందరు పుట్టుకతోనే వింతగా పుట్టడం, పుట్టిన తర్వాత రకరకాల వ్యాధులు రావడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. ఇక నిరుపేదలు, మధ్య తరగతి వారికి మాత్రం వస్తేమాత్రం వారి బాధ వర్ణానాతీతం. ఏపీలోని వైద్యులు మూడేళ్ల చిన్నారికి అరుదైన ఆపరేషన్‌ చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో కైకాల దుర్గా ప్రకాష్ దంపతులకు మూడేళ్ల క్రితం కొడుకు జన్మించాడు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివెరిసింది. అతనికి అభిషిక్త్ పేరు పెట్టారు. అయితే ఆరు నెలల కాలానికే కొడుకు తల విపరీతంగా పెరగటం ప్రారంభం అయింది. మొదట సాధారణ జబ్బుగానే భావించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యులకు చూపించారు. అయితే తల పెరగడంతో పాటు ఇతర సమస్యలున్నట్లు వైద్యలు గుర్తించారు. దీంతో కుమారున్ని బ్రతికించుకునేందుకు దుర్గా ప్రకాష్ అనేక ప్రయత్నాలు చేశాడు. 40 నుండి 60 సెంటీ మీటర్లు ఉండాల్సిన తల ఏకంగా 90 సెంటీ మీటర్లకు పెరిగిపోయింది. దీంతో పాటు గుండెలో కుడి పక్క భాగం పూర్తిగా నిర్మాణం కాలేదు. గుండెలో 10 నుండి 20 వరకూ ఉండాల్సిన ఒత్తిడి శాతం కూడా 138కి పెరిగిపోయింది.

చిన్నారికి ఐసెన్ మెంగర్ సిండ్రోమ్ వ్యాధి

మొదట స్విమ్స్ తిరుపతి హాస్పిటల్ కు తీసుకెళ్లగా, అక్కడ చిన్నారికి ఐసెన్ మెంగర్ సిండ్రోమ్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్లకి తల పెరగటం, నీరు చేరడంతో పాటు ఎదుగుదల లోపిస్తుంది. అయితే ఆపరేషన్ చేయడానికి వైద్యులు ముందుకు రాలేదు. మెదడులో ఉన్న లోపంతో పాటు గుండెలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక వేళ ఆపరేషన్‌ నిర్వహించినా బతికే అవకాశాలు ఉండవని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. స్విమ్స్ నుండి హైదరాబాద్ లోని కిమ్స్, నిమ్స్ ఆసుపత్రుల్లో చూపించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకు రాలేదు. ఇక దుర్గా ప్రకాష్ ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో లక్షల్లో ఖర్చు చేసి ఆపరేషన్‌ చేయించలేకపోయాడు..

గుంటూరులోని రావూస్‌ ఆస్పత్రికి..

ఇక తక్కువ ఖర్చుతో వైద్యం అవుతుందన్న నమ్మకంతో బాలున్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. అక్కడ కూడా శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. ఇక విషయం తెలుసుకున్న ప్రకాశ్‌ మిత్రులు గుంటూరులోని రావూస్ ఆసుపత్రి ప్రకాశ్‌ కు తెలిపారు.

రావూస్ ఆసుపత్రి వైద్యుడు పాటిబండ్ల మోహన్ రావు కు అభిషిక్త్ గుర్తించి చెప్పారు. దీంతో మోహన్ రావు ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకున్నారు. అతనికి మెదడులో మూడో గదిని ఓపెన్ చేసి స్టంట్ వేయడం ద్వారా బ్రతికించవచ్చని, ఇందుకు ఐదు లక్షల వరకూ ఖర్చు అవుతందని చెప్పారు. దుర్గా ప్రకాష్ కు అంత ఖర్చు పెట్టే స్తోమత లేదు. అదే విషయాన్ని మోహన్ రావుకు తెలిపారు. చిన్నారికి శస్త్ర చికిత్స చేయడం ఛాలెంజింగ్ తీసుకున్న వైద్యుడు ఉచితంగానే ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు.

ఐదు గంటల పాటు శస్త్ర చికిత్స

దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి అభిషిక్త్ కు శస్త్ర చికిత్స చేసి మెదడులో స్టంట్ వేశారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నాడు. లక్షల రూపాయల ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా చేసిన వైద్యుడికి చిన్నారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారి పూర్తిగా కోలుకునే వరకూ ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించనున్నట్లు వైద్యుడు మోహన్ రావు తెలిపారు. తన కుమారుని ప్రాణాలు కాపాడిన వైద్యులకు ఎప్పుడు రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News