రేపు విశాఖకు రాజ్ నాధ్ సింగ్

ఈనెల 17, 18 తేదీల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖలో పర్యటించనున్నారు

Update: 2025-07-16 08:09 GMT

ఈనెల 17, 18 తేదీల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖలో పర్యటించనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన కొత్త ఐఎన్ఎస్ నిస్తార్‌ యుద్ధనౌకను కొత్త జులై 18న నేవల్‌ డాక్‌యార్డులో రాజ్‌నాథ్‌ సింగ్ ను ప్రారంభించనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా నిస్తార్‌ సేవలలందించనుండటంతో ఈ యుద్ధనౌకను ప్రారంభించనున్నారు.

ఐఎన్ఎస్ నిస్తార్‌ యుద్ధనౌక...
భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో విశాఖతో సహా తూర్పు తీరాన్ని నాశనం చేయడానికి వచ్చిన పీఎన్‌ఎస్‌ ఘాజీ జలాంతర్గామిని అప్పటి ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ యుద్ధనౌక ధ్వంసం చేసింది. రాజ్ నాధ్ సింగ్ రేపు విశాఖకు వస్తుండటంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయి బందోబస్తుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.


Tags:    

Similar News