రేపు విశాఖకు రాష్ట్రపతి ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖకు రానున్నారు

Update: 2026-02-16 03:44 GMT

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖకు రానున్నారు. 17 వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖలోని ఐ ఎన్ ఎస్ డేగాకు చేరుకుంటారరు. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ చోళా కు చేరుకుంటారరు. అనంతరం బ్యాంక్ట్విట్ విందులో పాల్గొంటారు.

ఐఎన్ఎస్ డేగాలో...
18వ తేదీ ఉదయం ఐఎఫ్ఆర్ లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.రు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 18వ తేదీ న ఐ ఎఫ్ ఆర్ కు హాజరవుతారు. విశాఖలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజులు ఇక్కడే ఉండటంతో భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నవారికే ఈ పర్యటనలో పాల్గొనాలని అధికారులు కోరారు.


Tags:    

Similar News