రైతుల కష్టాలను తీర్చడానికి మేమున్నాం: ప్రధాని

Update: 2016-03-19 23:57 GMT

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. శనివారం దిల్లీలో నిర్వహించిన కృషీ ఉన్నతి మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. వ్యవసాయ సాంకేతిక సమాచారం అందరికీ చేరవేయాలి. ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే కచ్చితంగా చేస్తాం. మేం చేసిన ప్రతిదాన్ని వాళ్లు చేశామని చెప్తున్నారు. కొన్ని చోట్ల ప్రాజెక్టులు కట్టారు. రైతులకు మాత్రం నీరందలేదు. వేసవిలో నీటి పొదుపు ఎలా అనేది అందరూ ఆలోచించాలి. రైతులు ఆనందంగా ఉండాలంటే నీరు పుష్కలంగా ఉండాలి. రైతుల కష్టాల్లో పాలుపంచుకోవడానికి మేమున్నామని వారికి భరోసా ఇస్తున్నాం అని మోదీ స్పష్టం చేశారు.

Similar News