జగన్ వస్తే ఏపీ రాజధానిని తరలిస్తారా?

Update: 2017-07-10 05:56 GMT

వైసిపి ప్లీనరీ బూతుల ప్లీనరిగా ఉందని ..ఏక్కడా నిర్మాణాత్మక విషయాలపై చర్చించలేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయాలకు పనికి రారని ప్రశాంత్ కిషోర్ ని వ్యూహకర్తగా తీసికోచ్చారన్నారు. అక్టోబర్ 27 శుక్రవారమని, ఆరోజు సిబిఐ కోర్టుకు హజరవుతారా?పాదయాత్ర ప్రారంబిస్తారా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. జగన్ కి వయస్సు తక్కువ ఆశ ఏక్కువని..30 ఏళ్లు సిఎంగా ఉండాలనే కోరిక ఏ నేతకు ఉండదన్నారు. ఆంద్ర ప్రదేశ్ లో రుణమాఫీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా అవినీతి ఏవిధంగా జరిగిందో జగన్ చెప్పాలన్నారు. జగన్ రాజధాని భూముల్లో లక్షకోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని, జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని కూడా వేరే ప్రాంతానికి తరలిస్తారన్నారు. వైసీపీ నేతలకు భూములు ఉన్నచోట రాజధానికి తీసుకెళతారని ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.

Similar News