నేడు మరో పథకాన్ని ప్రారంభించనున్న జగన్

ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ మరో పథకానికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల [more]

Update: 2020-09-28 02:55 GMT

ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ మరో పథకానికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను స్వయంగా చూసిన జగన్‌ వారికి అండగా నిలుస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం, అందుకోసం అప్పులపాలవుతున్న వైనంను గమనించిన జగన్ రైతులు పడుతున్న అవస్థలను పూర్తిగా తొలగించేందుకు ఇచ్చిన హామీ కార్యరూపం దాలుస్తోంది. ఆనాడు పార్టీ మేనిఫేస్టోలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం ”వైయస్‌ఆర్‌ జలకళ” పథకంను అమలు చేస్తున్నారు. నేడు వైఎస్సార్ జలకళ పథకాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 2,340 కోట్ల రూపాయలను కేటాయించింది.

Tags:    

Similar News