సమాచార హక్కు కమిషనర్లను నియమించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ పాత్రికేయుడు హరిప్రసాద్, న్యాయవాది చెన్నారెడ్డి లను [more]

Update: 2021-05-05 01:02 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ పాత్రికేయుడు హరిప్రసాద్, న్యాయవాది చెన్నారెడ్డి లను రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనర్లుగా నియమించింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపింది. ఉల్చాల హరిప్రసాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌నుంచి చరిత్రలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో ఉన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్‌ అయిన కాకర్ల చెన్నారెడ్డి పలు జిల్లాల కోర్టుల్లో, రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో గత 15 ఏళ్ళుగా న్యాయవాదిగా ఉన్నారు.

Tags:    

Similar News