ప్రధాని మోదీకి జగన్ మరో లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి 25 లక్షల కోవిడ్ డోస్ లు పంపాలని లేఖలో కోరారు. ఈనెల 11వ [more]

Update: 2021-04-10 02:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి 25 లక్షల కోవిడ్ డోస్ లు పంపాలని లేఖలో కోరారు. ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ నాలుగురోజుల పాటు ఆరు లక్షల మందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీకా ఉత్సవ్ లో భాగంగా తమ రాష్ట్రానికి 25 లక్షల డోస్ లు కోవిడ్ టీకాలను పంపాలని జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడానికి సహకరించాలని జగన్ కోరారు.

Tags:    

Similar News