జగన్ కీలక నిర్ణయం

కరోనా వ్యాక్సినేషన్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్ ను అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. [more]

Update: 2021-03-25 01:23 GMT

కరోనా వ్యాక్సినేషన్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్ ను అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని జగన్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలంలో వారానికి నాలుగు రోజులు వ్యాక్సినేషన్ ను అందించాలన్నారు. రోజుకు రెండు గ్రామాల్లో పర్యటించి వ్యాక్సినేషన్ ఇవ్వాలని జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దని జగన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News