నేను అడుగుతున్నా జగన్....?

Update: 2018-07-31 10:46 GMT

కాపు రిజర్వేషన్ల పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని, తాను హామీ ఇవ్వలేనని అంటున్నారని, మరి కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను ప్రశ్నించవా? జగన్ అంటూ నిలదీశారు చంద్రబాబు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సినవి రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం పోర్టు వంటి వాటిపై కేంద్రాన్ని నిలదీయరా? అని జగన్ ను సూటిగా ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల విషయంపై కూడా తాము కేంద్రంతో పోరాడి సాధిస్తామన్నారు. అలాగే మత్స్యాకారులను ఎస్సీల్లో కలిపే విషయంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. వైసీపీని నమ్మవద్దని, కేంద్రంతో కేసులకోసం లాలూచీ పడిందని బాబు ధ్వజమెత్తారు.

Similar News