ఆయన ఇలాగే సోది వేస్తాడులే

టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విశాఖలో కరోనా కేసులను ప్రభుత్వం దాచి పెడుతుందన్న చంద్రబాబు విమర్శలకు కేంద్ర ఆరోగ్య శాఖ [more]

Update: 2020-04-19 06:22 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విశాఖలో కరోనా కేసులను ప్రభుత్వం దాచి పెడుతుందన్న చంద్రబాబు విమర్శలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్లియర్ చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే విశాఖలో కరోనా ప్రబలలేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడేమంటారని విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ప్రకటనతో టీడీపీ ఆరోపణలు అసత్యమని తేలిపోయిందన్నారు. మీడియాలో కన్పించకుంటే చంద్రబాబుకు నిద్రపట్టదని, ఆయన ప్రచారం పిచ్చి ముదిరి వీడియో కాన్ఫరెన్స్ ల పేరుతో రోజూ సోది చెబుతున్నారని టీడీపీ నేతలు కూడా అనుకుంటున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News