రాయలసీమ బిడ్డ ఎవరు? ఇద్దరి మధ్య ట్వీట్ వార్

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య ట్వీట్ వార్ ప్రారంభమయింది. ఎవరు రాయలసీమ బిడ్డో తేల్చుకోవాలంటూ ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి [more]

Update: 2020-05-13 06:33 GMT

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య ట్వీట్ వార్ ప్రారంభమయింది. ఎవరు రాయలసీమ బిడ్డో తేల్చుకోవాలంటూ ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జీవో నెంబరు 203పై చంద్రబాబు తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్డమైన విషయాలన్నింటినీ జూమ్ యాప్ ద్వారా మాట్లాడే చంద్రబాబు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డేనా? అఅని ప్రశ్నించారు. ఇక టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు దీనికి ధీటుగా ట్వీట్ చేశారు. కేసీఆర్, జగన్ లది తండ్రీ కొడుకుల అనుబంధంగా చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్ రాయలసీమ బిడ్డో కాదో? చెప్పాలని డిమాండ్ చేశారు. మెత్త బడతారా? మెడలు వంచి నీళ్లు సాధిస్తారా? చెప్పాలని అయ్యన్న పాత్రుడు కోరారు.

Tags:    

Similar News