బ్రేకింగ్ : సమత కేసులో ముగ్గురికీ ఉరి

సమత కేసులో దోషులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. గత నవంబరు [more]

Update: 2020-01-30 07:58 GMT

సమత కేసులో దోషులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. గత నవంబరు 24వ తేదీన సమత అదృశ్యమయింది. అదేరోజు సమత పై అత్యాచారం చేసి హత్య చేశారు. సమత కన్పించక పోవడంతో ఆమె భర్త లింగాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. షేక్ బాబా,షేక్ షాబొద్దీన్ ,షేక్ మగ్దుంలను నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Tags:    

Similar News