వాళ్లకు మళ్లీ క్వారంటైన్?

తెలంగాణలో క్వారంటైన్ ను పూర్తి చేసుకున్న 35 మందిని అక్కడి ప్రభుత్వం డిశ్చార్జ్ చేసింది. వారి సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. ప్రత్యేక బస్సులో ఏపీకి పంపేందుకు [more]

Update: 2020-04-09 06:27 GMT

తెలంగాణలో క్వారంటైన్ ను పూర్తి చేసుకున్న 35 మందిని అక్కడి ప్రభుత్వం డిశ్చార్జ్ చేసింది. వారి సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. ప్రత్యేక బస్సులో ఏపీకి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే గరికపాడు చెక్ పోస్టుకు చేరుకోగానే ఏపీ అధికారులు వారిని నిలిపివేశారు. ఇక్కడ తిరిగి క్వారంటైన్ లో ఉంటామంటేనే అనుమతిస్తామని ఏపీ అధికారులు చెబుతున్నారు. తమకు క్వారంటైన్ పూర్తయిందని అధికారులు ఇచ్చిన లేఖను చూపినా ఏపీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించేందుకు ఏపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News