అధికారులకు హైకోర్టు హెచ్చరిక
సంగారెడ్డి జిల్లా అధికారులను హైకోర్టు హెచ్చరించింది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా నిర్ణయాలను తీసుకున్న సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ [more]
సంగారెడ్డి జిల్లా అధికారులను హైకోర్టు హెచ్చరించింది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా నిర్ణయాలను తీసుకున్న సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ [more]
సంగారెడ్డి జిల్లా అధికారులను హైకోర్టు హెచ్చరించింది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా నిర్ణయాలను తీసుకున్న సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ ఎస్.శ్రీను, తహసిల్దార్ యు. ఉమాదేవి తీరును హైకోర్టు తప్పు పట్టింది. కోర్టు థిక్కరణకు పాల్పలడి అందులో శిక్ష పడితే మొక్కుబడి క్షమాపణలతో అప్పీల్ చేసుకుంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు విచారణకు ఎందుకు హాజరు కాలేదంటూ నిలదీసింది. వచ్చే విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.