సెకండ్ వన్డే : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

తొలి వన్డేలో ఓటమిని చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్ ను కోల్పోక తప్పదు. భారత్ తదుపరి

Update: 2022-01-21 09:45 GMT

నేడు దక్షిణాఫ్రికాతో టీమిండియా సెకండ్ వన్డే ఆడుతోంది. పార్ల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఉన్న ప్లేయర్స్ తోనే.. ఈ వన్డేలోనూ బరిలోకి దిగింది టీమిండియా. ఆల్‌రౌండర్ కేటగిరిలో వెంకటేష్ అయ్యర్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చినా రెండో వన్డేలో కూడా అతడికే తుది జట్టులో స్థానం కల్పించింది.

తొలి వన్డేలో ఓటమిని చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్ ను కోల్పోక తప్పదు. భారత్ తదుపరి మ్యాచ్ లో కొనసాగాలంటే ఈ వన్డేలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. బ్యాటింగ్ ఎంచుకుంది కాబట్టి భారీ స్కోర్ చేయాల్సిందే.
టీమిండియా : కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా : బవుమా (కెప్టెన్), డికాక్, జె.మలాన్, మర్‌క్రమ్, డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, మగాలా, కేశవ్ మహారాజ్, షాంసీ, ఎంగిడి


Tags:    

Similar News