బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. డాక్టర్ రమేష్ కుమార్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనకు సంబంధించి డాక్టర్ [more]

Update: 2020-09-14 07:17 GMT

ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. డాక్టర్ రమేష్ కుమార్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనకు సంబంధించి డాక్టర్ రమేష్ కుమార్ ను విచారించాలని పోలీసులు భావించారు. కానీ డాక్టర్ రమేష్ కుమార్ విచారణను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డాక్టర్ రమేష్ కుమార్ ను విచారించుకోవచ్చని, అయితే నిర్భంధంలోకి తీసుకోకుండా విచారించమని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. డాక్టర్ రమేష్ కూడా పోలీసు విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు కోరింది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే.

Tags:    

Similar News