కేంద్ర గెజిట్ రద్దు చేసే వరకూ పోరాటం

ఇద్దరు ముఖ్యమంత్రులు రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నదీ జలాలను ఇద్దరూ కలసి పెత్తనాన్ని కేంద్ర ప్రభుత్వానికి [more]

Update: 2021-07-27 07:45 GMT

ఇద్దరు ముఖ్యమంత్రులు రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నదీ జలాలను ఇద్దరూ కలసి పెత్తనాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి జలాలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వినియోగించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర గెజిట్ ను రద్దు చేసే వరకూ తాము పోరాటం చేస్తామన ిచెప్పారు. పెన్నా బేసిన్ ను కూడా మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు పనిచేయడం లేదని ఆయన విమర్శలు చేశారు.

Tags:    

Similar News