బ్రేకింగ్ : టీడీపీ నేత రాజీనామా

పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి సతీష్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి, పులివెందుల ఇన్ ఛార్జి పదవికి ఆయన రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం [more]

Update: 2020-03-10 06:44 GMT

పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి సతీష్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి, పులివెందుల ఇన్ ఛార్జి పదవికి ఆయన రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం తన అనుచరులతో సమావేశమైన సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరబోతున్నారు. చంద్రబాబుకు, తనకు మధ్య గత కొన్ని నెలలుగా అంతరం పెరిగిందని సతీష్ రెడ్డి తెలిపారు. పులివెందులలో పోటీ చేయడం కష్టమేనని సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సతీష్ రెడ్డి ఈ నెల 13వ తేదీన వైసీపీలో చేరే అవకాశం ఉంది. సతీష్ రెడ్డి రాజీనామాతో పులివెందులలో ఒక నేతను టీడీపీ కోల్పోయినట్లయింది.

Tags:    

Similar News