టైమింగ్ చూసుకునే వేలు పెట్టారు

మాన్సాస్ ట్రస్ట్ భూములను కాజేయడానికే వైసీపీ నేతలు సంచయితను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. అశోక్ గజపతి రాజు ను దెబ్బతీయడానికే [more]

Update: 2020-03-07 14:44 GMT

మాన్సాస్ ట్రస్ట్ భూములను కాజేయడానికే వైసీపీ నేతలు సంచయితను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. అశోక్ గజపతి రాజు ను దెబ్బతీయడానికే సంచయితను రంగంలోకి దించారన్నారు. సింహాచలం ట్రస్ట్ బోర్టులో కూడా ఈ ప్రాంతం వారిని కాకుండా వేరే వారిని నియమించారని, వైసీపీ నేతలు కూడా ఇదే విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అశోక్ గజపతి రాజు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయరని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ బోర్డు భూములన్నీ కోట్లాది రూపాయల విలువైనవని సబ్బం హరి చెప్పారు. అశోక్ గజపతిరాజును తెలుగుదేశం పార్టీ వెనకేసుకు రావడంలో తప్పు లేదన్నారు. ఎన్నికలు ఉన్న సమయంలో టైమింగ్ చూసుకునే వైసీపీ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకుందన్నారు. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సబ్బం హరి ప్రశ్నించారు.

Tags:    

Similar News