స్కీంలన్నీ ఇక జగన్ ఎత్తేస్తారు కాబోలు

జగన్ సంక్షేమ పథకాలను భవిష్యత్ లో కొనసాగించలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇందుకు సహకరించదన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో [more]

Update: 2020-11-04 08:49 GMT

జగన్ సంక్షేమ పథకాలను భవిష్యత్ లో కొనసాగించలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇందుకు సహకరించదన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, రానున్న రోజుల్లో జగనన్న పథకాలు ఏవీ వర్క్ అవుట్ కావని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో కీలక సేవలందించిన వారికి మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. ఆయుర్వేద డాక్టర్లకు కూడా జీతాలు నిలిపివేశారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. జీతాలే చెల్లించకపోతే సంక్షేమ పథకాలను జగన్ ఎలా అమలు చేస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

Tags:    

Similar News