భూమి కొన్నది కరెక్టే కానీ?

నిజంగా రాజధాని అమరావతిలో బినామీ పేర్ల మీద ఆస్తులను కొనుగోలు చేసి ఉంటే దానిని కేంద్రానికి పంపి బినామీ ఆస్తుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని పయ్యావుల [more]

Update: 2020-01-20 13:00 GMT

నిజంగా రాజధాని అమరావతిలో బినామీ పేర్ల మీద ఆస్తులను కొనుగోలు చేసి ఉంటే దానిని కేంద్రానికి పంపి బినామీ ఆస్తుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. మోదీ వచ్చాక బినామీ చట్టం తీసుకువచ్చారన్నారు. బీనామీ ఆస్తులు ఉంటే కేంద్రానికి అటాచ్ చేయాలని కోరారు. చాలా మంది తన పేరు చెప్పారని, రాజధాని ప్రకటన అనంతరం తాను కొనుగోలు చేశానని పయ్యావుల కేశవ్ తెలిపారు. రాజధాని ప్రాంతంలో తనకంటూ ఒక ఇల్లు ఉండాలన్న ఉద్దేశ్యంతోనే భూమిని కొనుగోలు చేశామన్నారు. అక్రమంగా కొనుగోలు చేసి ఉంటే నిర్దాక్షిణ్యంగా చర్యలు చేపట్టాలని కోరారు. అంతే తప్ప రాజధానిని మార్చాలన్న పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని బురద జల్లితే ఎలా అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఆస్తులు జప్తు చేయాలని కోరితే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకని నిలదీశారు.

Tags:    

Similar News