నిమ్మగడ్డ పనితీరుపై పవన్ అసంతృప్తి

పంచాయతీ ఎన్నికల మాదిరి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా తగ్గిందన్నారు. దాదాపు [more]

Update: 2021-03-19 01:10 GMT

పంచాయతీ ఎన్నికల మాదిరి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా తగ్గిందన్నారు. దాదాపు 35 శాతం మంది ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారన్నార. అదే వైసీపీకి లాభించిందని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీీది మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం కాదని పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై తీర్మానం చేయడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పాదయాత్రలు, ప్రకటనలకు పరిమితం కాకూడదని పవన్ కల్యాణ్ హహితవు పలికారు.

Tags:    

Similar News