భారత్ కు సరైన సమాధానం ఇస్తాం

పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాల దాడులపై పాకిస్థాన్ స్పందించింది. భారత దాడుల నేపథ్యంలో ఇవాళ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన పాకిస్థాన్ సెక్యూరిటీ [more]

Update: 2019-02-26 10:58 GMT

పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాల దాడులపై పాకిస్థాన్ స్పందించింది. భారత దాడుల నేపథ్యంలో ఇవాళ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన పాకిస్థాన్ సెక్యూరిటీ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. భారత్ కు సరై సమయంలో, సరైన చోట సరైన సమాధానం చెబుతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రజలు ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ ఇలా చేస్తుందనే తాము ప్రపంచానికి చెబుతూనే ఉన్నామని, ఇవాళ భారత్ దాడి చేసి తమ మాటను నిజం చేసిందని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పేర్కొన్నారు. భారత్ కు సరైన సమాధానం చెప్పే హక్కును తాము పొందామని, ఆత్మరక్షణ హక్కు తమకు కూడా ఉందని ఆయన అన్నారు.

Tags:    

Similar News