నేడు మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్

నేడు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే మోదీ మాట్లాడనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దేశంలోని మహారాష్ట్ర, ఉత్తర్ [more]

Update: 2020-09-23 03:35 GMT

నేడు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే మోదీ మాట్లాడనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దేశంలోని మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. కరోనా తీవ్రత, దానిపై తీసుకుంటున్న చర్యలను గురించి మోదీ ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నారు.

Tags:    

Similar News